గ్రామములో మరిడిమాంబ తీర్థం మహోత్సవం

1427చూసినవారు
గ్రామములో మరిడిమాంబ తీర్థం మహోత్సవం
దేవరపల్లి మండలం వేచలం గ్రామంలో శ్రీ మరిడిమాంబ తీర్థం మహోత్సవ సందర్భంగా..అమ్మవారికి పసుపు కుంకుమలతో, ధూప దీప నైవేద్యములతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. ఈ తీర్థ మహోత్సవం పురస్కరించుకుని ఎడ్ల పందెములు, బల్ల వేషాలతో గ్రామంలో సందడి జాతరతో మారుమోగిపోయింది.

ఈ జాతరను తిలకించడానికి గానూ చుట్టుపక్కల గ్రామాలు ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మహోత్సవం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి శటారినాయుడు ( నాయుడు తాత) ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్