గురందరపాలెంలో కార్డన్ సెర్చ్

564చూసినవారు
నర్సీపట్నం మండలం గురందరపాలెం గ్రామంలో శుక్రవారం డి. ఎస్. పి మోహన్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీలు చేశారు. వాహనాలు ఆపి రికార్డులను పరిశీలించారు. నాటు సారా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో కార్బన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. రూరల్ సీఐ హరి, వివిధ స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్