14 మంది సచివాలయ సిబ్బందికి ‌షోకాజ్ నోటీసులు

592చూసినవారు
14 మంది సచివాలయ సిబ్బందికి ‌షోకాజ్ నోటీసులు
నాతవరం మండలంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 14 మంది సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు నాతవరం ఎంపిడిఓ జె. రాంబాబు తెలిపారు. సోమవారం ఆయన నాతవరంలో మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటనకు వస్తున్నట్లు ముందురోజే సమాచారం ఇచ్చినప్పటికీ కొంత మంది సిబ్బంది గైర్హాజర్ కావడంతో నోటీసులు ఇచ్చామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల బ్యానర్లు పోస్టర్లు తొలగించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్