పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు, తాసిల్దార్ జానకమ్మ అన్నారు. కోటవురట్ల మండలం అన్నవరం గ్రామంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 368 మందికి
పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తహసిల్దార్ జానకమ్మ, సచివాలయ సిబ్బంది, సెక్రెటరీ, గ్రామ వాలంటీర్స్,
వైసీపీ నాయకులు, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.