విశాఖలోని వైఎస్సార్ ఏసిఏ - విడిసిఏ క్రికెట్ స్టేడియంలో బుధవారం ఢిల్లీ క్యాపిటల్ జట్టు ప్రాక్టిస్ చేసింది. ఈ నెల 31న ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ క్యాపిటల్ జట్టు విశాఖ చేరుకుంది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రీడాకారులు ప్రాక్టిస్ చేశారు.