వర్షాల నేపథ్యంలో మేయర్‌ పర్యటన

72చూసినవారు
విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైందని విశాఖ నగర మేయర్ హరివెంకట కుమారి పేర్కొన్నారు. ఆదివారం ఆమె జోన్-3, 5 లలో ఎర్రిగెడ్డ ను, పెదజాలారిపేట బీచ్ ను, జీవీఎంసీ లో సిఓసి సెంటర్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. జ్ఞానాపురం వద్ద ఎర్రిగెడ్డ లో వ్యర్ధాలను పరిశీలించి జెసిబి లతో తొలగించాలన్నారు.

సంబంధిత పోస్ట్