విశాఖలో వైసీపీ ప్యాకేజీలకు అమ్ముడుపోయిందని మాజీ విఎంఆర్డీఏ చైర్పర్సన్, మాజీ వైసీపీ నేత, ప్రస్తుతం టీడీపి నాయకురాలు అక్కరమాని విజయనిర్మల విమర్శలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. సర్వే రిపోర్టు బాలేదని విశాఖ ఈస్ట్ లో నాకు టికెట్ ఇవ్వలేమన్నారు. మరి ఎంవి వి రిపోర్టు బాగుందా? ప్యాకేజీలకు అమ్ముడు పోయేది ఎవరో తెలుసునని విమర్శించారు.