విశాఖలోని ఆరిలోవలో రౌడీ మూకలు హల్చల్ చేస్తున్నారు. ముఖ్యంగా గంజాయి మత్తులో రెచ్చిపోతున్నారు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మార్పు రావడం లేదు. గంజాయి, మద్యం మత్తులో ఏకంగా పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన భయాందోళన నెలకొంది. శనివారం రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై రౌడీ గ్యాంగ్ దాడికి పాల్పడింది. కానిస్టేబుల్ చేయి విరిగిపోవడంతో ఆస్పత్రికి తరలించారు.