
గాజువాక: కరెంట్ షాక్ కి గురై బాలుడు మృతి
విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థి దిలీప్ కుమార్ (16) చిన్న గంట్యాడ నాయుడు వీధిలోని బంధువుల ఇంటికి గురువారం వెళ్లాడు. మధ్యాహ్నం ఆ ఇంటిపైన ఉన్న విద్యుత్ హై టెన్షన్ లైన్ తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలియడంతో గాజువాక సీఐ పార్థసారథి సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.