పద్మనాభం మండలంలో స్వచ్ఛందంగా 43 మంది వాలంటీర్లు రాజీనామా
పద్మనాభం మండలంలో మద్ది, పద్మనాభం, రెడ్డిపల్లి సచివాలయాల్లో మొత్తం 43 మంది వాలంటీర్లు శనివారం స్వచ్ఛందంగా రాజీనామ పత్రాలను ఎంపీడీఓ బి. శైలజ కు అందజేశారు. వాలంటీర్లు మాట్లాడుతూ టిడిపి వాళ్ళు పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుండి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు గూర్చి ఇంటింటికి వెళ్లి వివరించి ముత్తంశెట్టి శ్రీనివాస రావు గెలుపు లక్ష్యంగా ప్రచారం చేస్తామని తెలిపారు.