మృతిని కుటుంబానికి న్యాయం చేయాలి
గాజువాక స్వతంత్ర నగర్ గంగవరం పోర్టు రోడ్డులో గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో అనుమానాస్పదంగా వడ్డాది ఉమామహేశ్వరరావు మృతి చెందారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి గురువారం రాత్రి కేజిహెచ్ ఆసుపత్రికి పంపారు. కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో శవపంచనామా చేశారని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం తల్లి నాగమణి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారని అన్నారు. దీనిపై మృతుని కుటుంబానికి న్యాయం చేయాలనీ అన్నారు.