హిందువులపై దాడులకు నిరసనగా ర్యాలీ

84చూసినవారు
హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ నర్సీపట్నంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హిందువుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అనంతరం కనకదుర్గ గుడి దగ్గర నుంచి అబిడ్స్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్