ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నాతవరం తహశీల్దార్ ఎన్. రమేశ్ కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం నాతవరం ఎంపీడీఓ కార్యాలయంలో బీఎల్వోలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ఓటర్లకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రాంబాబు, ఎస్సై రామారావు పాల్గొన్నారు.