విశాఖ రైల్వేజోన్‌కు త్వరలోనే భూమిపూజ

67చూసినవారు
విశాఖ రైల్వే జోన్‌కు త్వరలోనే భూమి పూజ చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. సోమవారం విశాఖలో వందేభారత్‌ రైలును ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దసరా తర్వాత మంచిరోజు చూసుకొని పనులు ప్రారంభిస్తామన్నారు. రైల్వే జోన్‌ కోసం పదేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో రైల్వే జోన్‌ సాకారమైందన్నారు.

సంబంధిత పోస్ట్