విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం

80చూసినవారు
విశాఖ రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లాట్ ఫారం నెంబర్ నాలుగులో కోర్బా ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రైల్వేస్టేషన్లో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. రైల్వే అధికారులు ప్రస్తుతం సంఘటన స్థలంలోనే ఉండి చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్