రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

16708చూసినవారు
పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసీ వ్యాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను కేజీహెచ్కి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్