రైళ్లు ర‌ద్దు.. ప్ర‌యాణికుల పాట్లు

77చూసినవారు
రైళ్లు ర‌ద్దు.. ప్ర‌యాణికుల పాట్లు
రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రైల్వే లైన్లు పాడయ్యాయి. విజయవాడ డివిజన్‌లో ముమ్మరంగా జరుగుతున్న రైల్వే లైన్ల అభివృద్ధి పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. పలుచోట్ల రైలు పట్టాలపై వరద నీరు ప్రవహించడం, ఇంకొన్ని ట్రాక్‌లు పాడవ్వడంతో విశాఖ నుంచి, విశాఖ మీదుగా వెళ్లే అనేక రైళ్లను రద్దు చేశారు. దీంతో విశాఖ రైల్వే స్టేష‌న్‌లో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

సంబంధిత పోస్ట్