నూకరాయితోటలో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలి

81చూసినవారు
కొయ్యూరు మండలంలోని బూదరాళ్ల పంచాయతీ పరిధి నూకరాయితోట గ్రామంలో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కురిసిన గాలివానకి పాఠశాల పై కప్పులు ఊడిపోయి శిధిలావస్థకు చేరిన భవనంలోనే సుమారు 30 మంది విద్యార్థులకు బోధనలు కొనసాగుతుందన్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని గిరిజనులు గురువారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్