అలరించిన సాంస్కృతిక నృత్యాలు

52చూసినవారు
శిక్షా సప్తాహ్ విద్య వారోత్సవాలలో భాగంగా కోటవురట్ల పి ఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎం నారాయణరెడ్డి ఆధ్వర్యంలో గురువారం 4వ రోజు కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కోలాటంతో అందరిని అలరించారు. నృత్యం చేసిన విద్యార్థులకు ఎంఈఓ జోషి బహుమతులను అందజేశారు. ఈ నెల 28 వరకు వివిధ రకముల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎంఈఓ అన్నారు. ఉపాధ్యాయులు ప్రమీల, భాను, చంద్రశేఖర్, శేఖర్, అనురాధ, బిఎస్ ప్రసాద్, సంధ్య, రత్నం, కళ్యాణం, రాజీవ్, శిరీష, కిషోర్, బాబు, వీరబాబు, శ్రీనివాస్, ప్రభాకర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్