అనకాపల్లి జిల్లాలో దొంగలు చెలరేగిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుంటున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి.. ఆపై దొంగతనాలకు పాల్పడుతున్నారు. పెందుర్తి సమీపంలోకి సూర్యానగర్లోని కామాక్షి అపార్ట్మెంట్లో మంగళవారం అర్ధరాత్రి దుండగులు ఓ ఫ్లాట్లో చొరబడి బంగారం దోచుకుపోయారు. బుధవారం ఉదయం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.