వివిధ రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో వచ్చిన డబ్బు వివరాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించాలని విశాఖలో సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం విశాఖలో ఆందోళన నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రికల్ బాండ్లు వివరాలను తెలియపరచకుండా 116 రోజుల సమయం కావాలని కోరడం సరికాదన్నారు.