పోర్టులో ఘనంగా స్వచ్ఛత హీ సేవ

82చూసినవారు
పోర్టులో ఘనంగా స్వచ్ఛత హీ సేవ
స్వచ్ఛ భారత్ మిషన్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం పోర్టు అథారిటీ 2024 సంవత్సరానికి సంబంధించిన స్వచ్ఛత హీ సేవ పక్షోత్సవాన్ని సోమవారం ప్రారంభించింది. ఈ ఏడాది స్వభావ స్వచ్ఛత - సంస్కార స్వచ్ఛత థీమ్ తో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్టు విభాగాధిపతులు, సీనియర్ అధికారులు, ఉద్యోగులతో కలసి పోర్టు చైర్మన్ డా. ఎం. అంగముత్తు స్వచ్ఛత ప్రతిజ్ఞను చేయించారు.

సంబంధిత పోస్ట్