ముంపునకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

51చూసినవారు
ముంపునకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
పెందుర్తి మండలం కోటనరవ, నరవ గ్రామాల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంగళవారం పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామాల మీదుగా వెళ్లే కాలువలకు పూడిక తీయకపోవడం వల్ల గ్రామాలు ముంపుకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గ్రామాలకు ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్