ప్రకాశం జిల్లా జువ్విగుంట క్రాస్ వద్ద నుంచి రేపు ఉదయం 9 గంటలకు యాత్ర ప్రారంభం కానుంది. పెద్ద అలవలపాడు, కనిగిరి, పెద్ద అరికట్ల, చిన్న అరికట్ల, మూగచింతల మీదుగా మధ్యాహ్నం 3:30 గంటలకు కొనకనమెట్ల క్రాస్ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి.. బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లి వద్ద రాత్రి బసకు సీఎం చేరుకుంటారు.