వైసీపీ ఎంపీల సమావేశంలో వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం సన్నగిల్లకూడదని వైసీపీ ఎంపీలకు ధైర్యం నూరిపోసారు. మనలో పోరాటపటిమ తగ్గకూడదని సూచనలు చేశారు. నా వయసు చిన్నదే. నాలో సత్తువ ఇంకా తగ్గలేదని.. 14 నెలలు పాదయాత్ర చేశాను. దేవుడుదయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉందన్నారు. రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని, లోక్సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు.