ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఆరెస్సెస్ అధినేత సర్ సంఘ్చాలక్ మోహన్ భగవత్తో భేటీ కానున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వీరిద్దరు మొదటిసారి సమావేశమవుతున్నారు. కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ కీలకం. ఉత్తరప్రదేశ్లో ఆర్ఎస్ఎస్ విస్తరణతో పాటు పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.