మొగల్తూరుమండలంలోని ముత్యాలపల్లి, మోడీ, కేపీ పాలెంసౌత్, కేపీ పాలెం నార్త్ గ్రామాలలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో మొగల్తూరు ఎస్సై కె వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం సి. ఐ. ఎస్. ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్సై కోరారు.