పాలకొల్లులో భారత్ బంద్ సంపూర్ణంగా ముగిసింది

82చూసినవారు
పాలకొల్లులో భారత్ బంద్ సంపూర్ణంగా ముగిసింది
పాలకొల్లులో నియోజకవర్గ మాలమహానాడు ఐక్య జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం బంద్‌ సంపూర్ణంగా ముగిసింది. మోటారు సైకిళ్ళపై తిరుగుతూ వ్యాపార సంస్థలను, రవాణా వాహనాలను తిరగకుండా అడ్డుకున్నారు. ఆర్టీసీ స్వచ్ఛందంగా బస్సులు నడపలేదు. విద్యాసంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసు వంటి ప్రభుత్వ సంస్థలను మూయించి వేశారు. లాకుల సెంటర్‌లో నాయకులు రోడ్డుపై బైఠాయించి ఎస్సీ వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అంటూ నినాదాలిచ్చారు.

సంబంధిత పోస్ట్