రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచేసిన పాపం వైసిపిది

63చూసినవారు
రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచేసిన పాపం వైసీపీ ప్రభుత్వానిదే అని తణుకు మాజీ ఎమ్మెల్యే, కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమ సంపాదన కోసం వైసీపీ నేతలు యువత ఆరోగ్యాన్ని పణంగా పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసిపి దుర్మార్గ పాలన పట్ల అవగాహన కల్పించి కూటమికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్