ఆచంట మండలం కోడేరు గ్రామ సచివాలయం లో వాలంటీర్లు గా విధులు నిర్వహిస్తున్న 5 గురు యువతీ, యువకులు బుధవారం తమ సభ్యత్వం కి రాజీనామాలు చేసారు.తమకు వాలంటీర్లు సీఎం జగన్ అవకాశం కలిపించారని, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పేరుతో ఈసీ తమపై అనేక ఆంక్షలు విధించిందని, దీనితో తమ సభ్యత్వాలకి స్వచందంగా రాజీనామాలు చేస్తున్నామని తెలిపారు.ఇకపై సీఎం జగన్ వెంట నడుస్తామని వెల్లడించారు.