బాధితులకు రూ. కోటి సహాయమే లక్ష్యం

75చూసినవారు
బాధితులకు రూ. కోటి సహాయమే లక్ష్యం
విజయవాడ వరద బాధితులకు సహాయార్ధంగా భీమవరం నియోజకవర్గం నుంచి రూ. కోటి విరాళాన్ని అందిస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. ఇప్పటికే దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్