కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ. జిల్లాలో ఆక్వా రైతులు రొయ్యలు, చేపలను కష్టపడి పండిస్తున్నారని, ఆక్వా రైతుల కృషి వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కూడా వస్తుందన్నారు. పన్నుల రూపంలో విదేశీమారక ద్రవ్యం రూపంలో వేల కోట్లు ఆదాయాలు ప్రభుత్వాలు పొందుతున్నాయన్నారు.