పోలీసులు పనితీరును మెరుగుపరచుకోవాలి: డీజీపీ

69చూసినవారు
పోలీసులు పనితీరును మెరుగుపరచుకోవాలి: డీజీపీ
ఏలూరు రేంజ్ పరిధిలోని వివిధ జిల్లాల ఎస్పీలతో రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు బుధవారం ఏలూరులో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం గంజాయి మీద 100 రోజులు ప్రణాళిక రూపొందించాం. గంజాయి మాదకద్రవ్యాలపై ప్రజలకు, చిన్న పిల్లలకు కూడా అవగాహన కల్పించాలన్నారు. మహిళలు మరియు మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టమన్నారు. అలాగే పోలీసులు పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్