జంగారెడిగూడెంలో జరిగిన భాష్యం జోనల్ క్రీడల్లో నల్లజర్ల భాష్యం శాఖ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. క్రికెట్, త్రోబాల్, కబడ్డీ, డాడ్జ్ బాల్, షటిల్ విభాగాల్లో ప్రథమ స్థానాలు 9. ద్వితీయ స్థానాలు 12, అలాగే 400మీ రిలే పరుగు పందెంలో మొదటి స్థానాలు కైవసం చేసుకుని ఓవరాల్ చొప్మియన్ సాధించారు. ఈపోటీలు భాష్యం జోనల్ విద్యాధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించగా నాలుగు బ్రాంచిల
ఉపాధ్యాయులు పాల్గొన్నారు.