విజయ డైరీ కార్మికుల ఉపాధిని కాపాడాలి

663చూసినవారు
విజయ డైరీ కార్మికుల ఉపాధిని కాపాడాలి
ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లి గ్రామంలో విజయ డైరీ కార్మికులను 70 మందిని అమూల్ డైరీలోకి తీసుకుని.. వారి ఉపాధిని కాపాడాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో రెండోరోజు కార్మికులు ఆందోళన కొనసాగించారు. తొలుత ఫ్యాక్టరీ ముందు టెంట్ వేసి ధర్నా చేశారు అనంతరం అమూల్ పాలవహణలను కార్మికులు అపి తమ నిరసన కొనసాగించారు.

పోలీసులు వచ్చి కార్మికులను చెదరగొట్టారు. అనంతరం జిల్లా అధికారి డి. డి. ఉమాదేవి, పోలీస్, రెవిన్యూ సిబ్బంది. కార్మికులతో చర్చలు జరిపారు. ఈనెలాఖరు వరకు పనులు ఆపకుండా సహకరించాలని డి. డి. కార్మికులకు విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర ఎం. డి. అహ్మద్బాబు కు కార్మికులను అమూల్ లో తీసుకోవాలని లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. అలాగే మిగిలిన వాళ్లకు నష్టపరిహారం ఇచ్చేలా కృషి చేయాలని సీటు నేత వై. సల్మాన్రాజు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్