విజయవాడ జోన్ పరిధిలోని రైల్వే లైన్ల నిర్వహణ పనుల్లో భాగంగా వచ్చే నెల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆ శాఖాధికారులు బుధవారం తెలిపారు. ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకు నరసాపురం - విజయవాడ, ఆగస్టు 5 నుంచి 12 వరకు విజయవాడ - నరసాపురం, ఆగస్టు 4 నుంచి 10 వరకు నరసాపురం గుంటూరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కావున ప్రయాణికులు గమనించాలన్నారు.