తండ్రి కొడుకులు పరస్పరం ఘర్షణ, తండ్రి మృతి

20089చూసినవారు
తండ్రి కొడుకులు పరస్పరం ఘర్షణ, తండ్రి మృతి
కుటుంబ కలహాలు నేపథ్యంలో తండ్రి కొడుకులు పరస్పరం దాడి ఘటనలో తండ్రి మృతి చెందిన ఘటన ఉండ్రాజవరం మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఆర్ కె నగర్ కాలనీలో నివాసం ఉంటున్న గుల్లంకి వెంకటరమణ, గుల్లంకి వంశీ బుధవారం రాత్రి ఘర్షణ పడ్డారు. ఈ దాడిలో ఇరువురు తీవ్రగాయాల పాలై తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి వెంకటరమణ మృతి చెందాడు. ఇదే ఘర్షణలో తల్లికి సైతం గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్