బస్సులో కానీ.. ట్రైన్లో కానీ.. ప్రయాణించేటప్పుడు కొన్ని సార్లు విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి ఘటనే ఒకటి ఇటీవల కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులో నాలుగు చిలుకలను తీసుకెళ్తున్న యజమానికి ఓ కండక్టర్ రూ.444ల టికెట్ కొట్టాడు. చిన్నారికి ఉచిత టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ టికెట్ సోషల్ మీడియాలోని పలు ప్లాట్ ఫాంలలో వైరలవుతోంది. అది చూసిన తోటి ప్రయాణికులు షాక్ అయ్యారు.