పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం నుండి విజయవాడకు ఆహారం వాహనం

56చూసినవారు
పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం నుండి విజయవాడకు ఆహారం వాహనం
విజయవాడ వరద బాధితుల సహాయార్దం దాతలు ఇచ్చిన ఆహారం, ఇతర నిత్యవసర సామగ్రిని పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం నుండి శుక్రవారం ప్రత్యేక వాహనంలో విజయవాడకు పంపామని తహశీల్దార్ వై. దుర్గా కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా సరుకులను తరలించే వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు ఆపద కాలంలో, దాతలు సహాయం చేసి ఆదుకునే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్