పాలకొల్లు పట్టణ పరిధిలోని జి. వి. ఎస్. వి. ఆర్. ఎం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, నషా ముక్త్ భారత్ అభియాన్ ఆదేశాల మేరకు డ్రగ్స్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. హెచ్ఎం రాయపూడి భవానీ ప్రసాద్ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.