ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి

79చూసినవారు
పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో సోమవారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీరాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు, కంప్యూటర్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను మంత్రి చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్