మానవత ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

73చూసినవారు
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పెంటపాడు ఎస్టీవీఎన్ హైస్కూల్ నుంచి శాంతి ర్యాలీ నిర్వహించారు. తొలుత ర్యాలీని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సేవే ధ్యేయంగా మానవత స్వచ్ఛంద సంస్థ పనిచేయడం అభినందనీయమన్నారు. ఇంతటి మంచి కార్యక్రమంలో తాను పాల్గొనే అవకాశం కల్పించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. సంస్థ జిల్లా విద్యాకమిటీ ఛైర్మన్ మోహన్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్