అత్తిలి మండలం మంచిలి గ్రామంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఏఎన్ఎం అనంతలక్ష్మి ఆధ్వర్యంలో వైద్యబృందం గ్రామంలో పర్యటించి, పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అనంతరం దోమలు వ్యాప్తి నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలను గ్రామస్థులకు వివరించారు. ఇళ్ల వద్ద పనికిరాని వస్తువులు, మురుగునీరు నిల్వలు ఉంచరాదని సూచించారు.