వయేర్యుకు భారీగా వరద నీరు

81చూసినవారు
వయేర్యుకు భారీగా వరద నీరు
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వయేర్యుకు వరద నీరు చేరుతోంది. తణుకు మండలం దువ్వ వయ్యేరు రెగ్యులేటర్‌ వద్ద ఆదివారం సాయంత్రానికి నీటి మట్టం 9 అడుగులకు చేరుకుంది. ఎగువున కొంగువారిగూడెం ప్రాజెక్టు నుంచి 2500 క్యూసెక్కులు, బయనేరు, జల్లేరు తదితర వాగుల నుంచి 500 క్యూసెక్కులు ఇతర కాలువల నుంచి నందమూరు అక్విడక్టుకు మొత్తం 5000 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో యనమదుర్రు డ్రెయిన్‌ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

సంబంధిత పోస్ట్