ప్రజలకు స్వేచ్ఛ రావాలంటే టిడిపి కూటమికి ఓటు వేయాలని ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు. సోమవారం తణుకు పట్టణంలో ఒకటవ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐదేళ్ల వైసిపి పాలనలో అరాచకాలను ప్రజలు భరించలేక ఆ పార్టీని ప్రజలు వీడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయారని ఆమె విమర్శించారు.