మాజీ సీఎం జగన్ పై ఉండి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

85చూసినవారు
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉండి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణం రాజు శుక్రవారం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు బొట్టు పెట్టుకుంటే ఇష్టం ఉండదని అన్నారు. అలాగే గతంలో ఒకరిద్దరూ బొట్టు పెట్టుకుని వెళ్తే చిరాకు పడ్డారని అన్నారు. అదేవిధంగా భారతదేశం సెక్యులర్ దేశమని మన మతాన్ని పూజించి ఇతర మతాన్ని గౌరవించాలని అన్నారు. కానీ జగన్ కు ఇతర మతం అంటే ద్వేషమని తాజాగా టీటీడీలో జరిగిన పరిణామాలు చూస్తే అర్థమవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్