ఉప్పుటేరుకు పెరుగుతున్న వరద ప్రవాహం

57చూసినవారు
ఉప్పుటేరుకు పెరుగుతున్న వరద ప్రవాహం
ఉప్పుటేరులో తూడు, గుర్రపుడెక్క తొలగించడంతో వరద నీటి ప్రవాహం వేగం పుంజుకుంది. దీంతో ఆకివీడులోని సమతానగర్‌ చినకాపవరం మురుగు కాల్వ వరద నీరు బుధవారం తారస్థాయికి చేరుకోవడంతో వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది. వంతెనకు ఒకవైపు గొయ్యి ఏర్పడింది. గ్రామస్థులు భారీ వాహనాలను నిలిపివేసేందుకు కొంతమేర అడ్డుకట్టారు. దీంతో ఆకివీడు నుంచి చినిమిల్లిపాడు, సిద్దాపురం, కళింగపాలెం వెళ్ళేందుకు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్