అత్తిలిలో బైక్ ర్యాలీ చేసిన మంత్రి కారుమూరి
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బుధవారం అత్తిలి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేశారు.