కొయ్యలగూడెం మండలంలో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు
జనసేన పార్టీ సిద్దాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాల నచ్చి ఎంతో మంది జనసేన పార్టీలో చేరుతున్నారని పోలవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు అన్నారు. ఈ మేరకు కొయ్యలగూడెం మండలం అంకాలగూడెంలో మంగళవారం సుమారు 100 కుటుంబాల వారు కరాటం రాంబాబు సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాలరాజు, కరాటం రాంబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కూటమి గెలుపుకు కృషి చేయాలని సూచించారు.