ఆర్డీవోకు వినతిపత్రం అందజేత
తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నుంచి భీమవరం కలెక్టర్ ఆఫీస్ కి ప్రభుత్వ వాహనాన్ని, తన ఇంటిలో మున్సిపాలిటీ సిబ్బందిని వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కమిషనర్ ఎ. శ్యాముల్ పై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో చెన్నయ్యకు టీడీపీ పట్టణాధ్యక్షుడు పట్నాల రాంపండు శనివారం వినతిపత్రం అందించారు. ఇన్ చార్జి మున్సిపల్ కమీషనర్ మురళీకృష్ణకు బాధ్యతలు అప్పజెప్పకుండా వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు.