ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనకు బయల్దేరి.. శనివారం అక్కడకు చేరుకున్నారు. జగన్ లండన్లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన విమానం దిగుతున్న క్రమంలో 'జై జగన్' అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఎన్నికల కౌంటింగ్కు ముందుగానే మే 31వ తేదీ రాత్రి జగన్ రాష్ట్రానికి వస్తారు.